కృష్ణ జిల్లా,గంపలగూడెం, వినగడప పంచాయతీ పరిధిలో వివాహాలు చేసుకునే యువతులకు పసుపు కుంకుమ కింద భరత్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పగడాల భరత్, పగడాల కిరణ్, పసుపులేటి సత్య నారాయణ ఆర్థికసాయం కింద రూ.2,116 అందించనున్నట్లు జనసేన మండల ప్రధాన కార్యదర్శి వట్టికొండ కృష్ణ శుక్రవారం విలేకరులకు తెలిపారు. దీనిని 2023 జనవరి నుంచి డిసెంబరు వరకు అమలు చేస్తామన్నారు. వివాహానికి ఐదు రోజుల ముందు పసుపులేటి సత్యనారాయణకు శుభలేఖ అందించాలని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa