సమస్య పరిష్కారం అయ్యేవరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని నర్సీపట్నం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త రాజన వీర వెంకట సూర్య చంద్ర స్పష్టం చేశారు. గొలుగొండ, నాతవరం మండలాల్లో రహదారుల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆయన శనివారం ఉదయం నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. గొలుగొండ మండలం ఆరిలోవ రహదారికి తక్షణం మరమ్మతులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే నాతవరం తాండవ మధ్య రహదారిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన జనసేన నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa