టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలీసుశాఖలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఎస్పీ రిషాంత్రెడ్డి అన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అచ్చెన్నపై పోలీసు సంఘం తరపున చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీ రిషాంత్రెడ్డికి ఫిర్యాదు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తాము 500 మందితో బందోబస్తు నిర్వహించామన్నారు. కుప్పం సభలో అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు పోలీసులను రెచ్చగొట్టేలా, స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. ఎస్పీని కలిసిన వారిలో ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు ఉదయ్కుమార్, సెక్రటరీ రామ్మోహన్ రావు, సభ్యులు పాల్గొన్నారు. అలాగే, జిల్లా పోలీసు అధికారుల సంఘం, జిల్లా మాజీ పోలీసు అధికారుల సంఘం నేతలు చిత్తూరు ప్రెస్క్లబ్లో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. పోలీసులను కించపరిచేలా మాట్లాడిన అచ్చెన్నాయుడు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. లేదంటే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశాల్లో జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు ఉదయకుమార్, కార్యదర్శి రామ్మోహన్, కార్యనిర్వాహక కార్యదర్శి ఖాదర్బాషా, శరవణ.. జిల్లా విశ్రాంత పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు మురళి, ఉపాధ్యక్షుడు మునిరాజ, కార్యనిర్వహక కార్యదర్శి వేణు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa