జగన్ ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తుతామని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తెలిపారు. ‘‘భారతీ పే’’ యాప్ పోస్టు వ్యవహారంలో సీఐడీ విచారణకు చింతకాయల విజయ్ హాజరయ్యారు. టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్న విజయవాడ నుంచి గుంటూరు సీఐడి కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడారు. జగన్ అధికారంలోకి వచ్చాక బీసీ నేతలను అణగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. బీసీలంతా చంద్రబాబుకు అండగా ఉంటారని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. సీఐడీ కేసులకు భయపడేది లేదు.. ధీటుగా ఎదుర్కొంటామని తెలిపారు. కేసులు పెట్టి భయపెడదాం అనుకుంటే దేనికైనా రెడీ అని చెప్పుకొచ్చారు. చింతకాయల విజయ్ మహిళలపై సోషల్ మీడియాలో ఎటువంటి అసభ్యకరమైనవి పెట్టలేదు.. అదంతా ఫేక్ అని వెల్లడించారు. జగన్ విధానాలను ఎండగడతాం తప్ప మహిళల గురించి తప్పుగా మాట్లాడే సంస్కృతి మాది కాదు అని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa