సీఐడీ విచారణకు సహకరించాలనే తాను వచ్చానని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ వెల్లడించారు. ఇదిలావుంటే ఆయన సోమవారంనాడు సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన కేసులో వచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణకు వచ్చానన్నారు విజయ్. హైదరాబాద్లో తమ ఇంటిపై సీఐడీ అధికారులు వచ్చారని.. చిన్న పిల్లలను కూడా బెదిరించారని ధ్వజమెత్తారు. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోందని.. తనను మెటీరియల్ ఏమీ అడగవద్దని కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. సీఐడీ విచారణకు సహకరించాలని తాను వచ్చినట్లు తెలిపారు. కోర్టు అనుమతి తీసుకుని విచారణకు హాజరయ్యానని.. బీసీలపై ఈ ప్రభుత్వం కక్షగట్టిందని మండిపడ్డారు. సెంటు భూమి కోసం తమ ఇంటిపై 500 మంది పోలీసులతో దాడి చేశారని.. అక్రమ కేసులతో తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణిపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఐటీడీపీ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ ట్వీట్లు చేశారని.. ఈ వ్యవమారం వెనుక చింతకాయల విజయ్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయనపై సీఐడీ క్రైమ్ నంబర్ 14/2022 ఐపీఎసీ సెక్షన్లు 419, 469, 153–ఎ, 505(2), 120–బి రెడ్విత్ 34, ఐటీ చట్టం సెక్షన్ 66(సి) కింద కేసు నమోదు చేశారు.
ఆ తర్వాత కొద్దిరోజులకు ఏపీ సీఐడీ సీఐడీ అధికారులు హైదరాబాద్లోని విజయ్ నివాసానికి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ విజయ్ అందుబాటులో లేరు.. విచారణకు వెళ్లలేదు. ఆ తర్వాత సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసును సవాలు చేస్తూ విజయ్ హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ విచారణకు సహకరించాలని కోర్టు సూచించింది. దీంతో ఆయన విచారణకు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa