టీడీపీ నేతలకు ఝలక్ ఇస్తూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వారిపై పరువు నష్టందావా వేశారు. గన్నవరం టీడీపీ ఇంఛార్జ్ బచ్చుల అర్జునుడు, మరో నేత పట్టాభిపై స్థానిక కోర్టులో ఎమ్మెల్యే వంశీ పరువునష్టం దావా వేశారు. తాను 2019 ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచానని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, నాడు-నేడు పథకాలకు ఆయాకర్షితుడనై మద్దతు తెలిపాను అన్నారు. అందుకు టీడీపీకి చెందిన కొంత నాపై సోషల్ మీడియా, కొన్ని పత్రికలు ద్వారా దుష్ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. టీడీపీకి మద్దతుగా ఉంటే.. ఒకలా బయటకు వస్తే మరోలా దుష్ప్రచారం చేయడం అలవాటన్నారు.
విజయవాడలో సంకల్ప సిద్దిలో అవినీతి జరిగిందని కొన్ని మీడియాల ద్వారా తెలిసిందన్నారు వంశీ. రాజకీయ జీవితంలో ఒక్క అవినీతికి కూడా పాల్పడని తనపై టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడారని.. టీడీపీకి చెందిన పట్టాభి, బచ్చుల అర్జునుడు తీవ్ర పదజాలంతో అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేశారన్నారు. తాను, కొడాలి నాని కోట్లు అవినీతి చేసి బెంగుళూరులో ఆస్తులు కొన్నట్లు మీడియాలో ప్రకటనలు ఇచ్చారన్నారు.
ఈ సంకల్ప సిద్ది విషయంలో గతంలో ఇచ్చిన నోటీస్కి రిప్లై ఇవ్వలేదన్నారు గన్నవరం ఎమ్మెల్యే. టీడీపీ నేతలు రిప్లై ఇవ్వని కారణంగా ఇవాళ గన్నవరం కోర్టుని ఆశ్రయించాను అన్నారు. తనపై కావాలని తీవ్ర పదజాలంతో మీడియాలో ప్రకటనలు చేసిన వారికి శిక్ష వేయాలని కోరారు వంశీ. గన్నవరం కోర్టులో వంశీ పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది.
సంకల్ప సిద్ధి కేసు విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని గతంలోనే వంశీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. పట్టాభి, బచ్చుల అర్జునుడిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ఈ సంకల్ప సిద్ధి కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేశారని.. అసలు వాళ్లెవరో కూడా తనకు తెలియదన్నారు. గతేడాది సంక్రాంతి సమయంలో కూడా తాను క్యాసినో పెట్టానని తప్పుడు ప్రచారం చేశారని.. ఇప్పుడు మళ్లీ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa