ఆనందపురం మండలం, లోడగాలవనిపాలెం పంచాయతీ నెళ్తేరు గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి బంక (28) మంగళవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. బంక సురేష్ పంజాబ్ లో ఆర్మీ ఉద్యోగ విధులు నిర్వహిస్తూ సంక్రాంతి పండగ నిమిత్తం నేలతేరు వచ్చాడు. భార్య సంధ్య ఏడాది పాప తన్వి ఉన్నారు. సురేష్ మంగళవారం ఉదయం నిద్రలేచి బయటకు వెళ్తానని భార్యతో చెప్పి వెళ్లాడు. ఎంతకీ రాకపోవడంతో భార్య సంధ్య స్నేహితుల ద్వారా చేయగా ఈగలవానిపాలెం సమీపంలోని ఎర్ర బంధచెరువు వద్ద మృతి చెంది ఉండటాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు పక్కన పురుగుల మందు డబ్బా ఉన్నట్లు గుర్తించారు. అప్పుల పాలై మనస్తాపంతో మృతి చెందినట్టు భార్య సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఏఎస్ఐ సత్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa