తిరుమల శ్రీవారి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. గతేడాది మార్చి నుంచి హుండీ ఆదాయం వరుసగా ప్రతి నెలా రూ.వంద కోట్లు దాటుతోంది. కాగా, జనవరిలో 31వ తేదీ వరకు 20,58,242 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.122.68 కోట్లు లభించింది. మరోవైపు జనవరి 2వ తేదీన రూ.7.68 కోట్ల హుండీ ఆదాయం రావడం గమనార్హం.28వ తేదీ రథసప్తమి రోజున అత్యధికంగా 80,094 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మార్చిలో రూ.128.64 కోట్లు, ఏప్రిల్లో రూ.127.65 కోట్లు, మేలో రూ.130.29 కోట్లు, జూన్లో రూ.123.74 కోట్లు, జూలైలో రూ.139.33 కోట్లు, ఆగస్టులో రూ.140.34 కోట్లు (ఇదే అధికం), సెప్టెంబరులో రూ.122.19 కోట్లు, అక్టోబరులో రూ.122.83 కోట్లు, నవంబరులో రూ.127.31 కోట్లు, డిసెంబరులో రూ.129.37 కోట్లు లభించింది. కాగా, శుక్రవారం టీటీడీ డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరుగనుంది. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భక్తులు ఈవో ధర్మారెడ్డితో నేరుగా మాట్లాడవచ్చు. దీనికోసం 0877 2263261 నంబరులో సంప్రదించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa