నల్గొండ జిల్లా కేంద్రంలోని వీటి కాలనీలో గల శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య, మంగళ వాయిద్యాలు మోగుతుండగా స్వామి వారు అమ్మవారి మెడలో మంగళసూత్ర ధారణ చేశారు. అంతకుముందే స్వామి, అమ్మవార్లను పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి, రంగురంగుల పూలతో అలంకరించిన వేదిక పైన ఆసీనులను చేసి శాస్త్రోక్తంగా పుణ్యావాచనం, కంకణ ధారణ రక్షాబంధన్ , పాదపక్షాళన, జీలకర్ర బెల్లం వంటి కళ్యాణ తంతును నడిపించారు. భక్తుల గోవింద నామ స్మరణ మధ్య వేద పండితులు పవన్ శర్మ సాయి శర్మ ఆధ్వర్యంలో కల్యాణాన్ని జరిపించారు. అనంతరం తలంబ్రాలు ఘట్టం నిర్వహించారు. కళ్యాణ పీటల మీద భక్తులు పెద్ద సంఖ్యలో కూర్చున్నారు. చుట్టుపక్కల కాలనీలో చెందిన ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకించి పరవశించిపోయారు. దీంతో ఆలయమంతా భక్తుల సందడి కిటకిటలాడింది. విద్యుత్ దీపాలతో మనోహరంగా వెలిగింది. కళ్యాణ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను, అన్నదాన ప్రసాద వితరణ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa