ప్రొద్దుటూరు స్థానిక కొత్తపల్లె పంచాయతీలోని అమృతానగర్ లో శనివారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పధకాల అమలు తీరును ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, మండల మాజీ ఉపాధక్షుడు మల్లెల రాజారాంరెడ్డి, ఎంపిపి శేఖర్ యాదవ్, ఎంపిటిసి భాగ్యమ్మ, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ మార్తల ఓబుల్ రెడ్డి, నాయకులు కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, సానపురెడ్డి ప్రతాప్ రెడ్డి, జిల్లా తొగటవీర క్షత్రియ సేవా సంఘం అధ్యక్షులు బండారు సూర్యనారాయణ, వార్డు మెంబర్లు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa