కొన్ని జిల్లాల కేంద్రాలను అర్బన్, రూరల్ మండలాలుగా విభజించేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లా కేంద్రాలను అర్బన్, రూరల్ మండలాలుగా విభజించాలని నిర్ణయించింది. తాడేపల్లిగూడెంలో పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్మెంట్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే, ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్టు ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఇదిలావుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోని మొదటి బ్లాక్లోని నిర్వహించిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాలు, పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించింది. ఇందులో భాగంగా భారీ పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ప్రతిపాదనలను కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపారు. సుమారు రూ.1.45 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. న్యూఎనర్జీ పార్క్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 2 విడతల్లో మొత్తంగా రూ.1.10 లక్షల కోట్లతో న్యూ ఎనర్జీ పార్క్.. 1,000 మెగావాట్ల చొప్పున విండ్, సోలార్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇక, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి విడతలో రూ. 55 వేల కోట్లు, రెండో విడతలో రూ.55 వేల కోట్ల పెట్టుబడికి అంగీకారం తెలిపింది. మొత్తంగా ప్రభుత్వం రూ.1,10,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఫేజ్ వన్లో 30 వేల మందికి, ఫేజ్ 2 లో 31 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. నాలుగు విడతల్లో మొత్తంగా రూ.10,500 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా.. 2 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు.
అలాగే విశాఖపట్నం టెక్ పార్కుకు 60 ఎకరాలు కేటాయించడంతో పాటు, 100 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త పాలసీలో భాగంగా పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. బందరు పోర్టుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ. 3,940 కోట్ల రుణం తీసుకునేందుకు మంత్రివర్గం అంగీకారం తెలిపింది. ఇందుకోసం 9.75 శాతం వడ్డీతో రూ. 3,940 కోట్ల రుణం తీసుకోనుంది. మరోవైపు నెల్లూరు బ్యారేజీకి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బ్యారేజీగా పేరు మార్చేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గ్రానైట్ కంపెనీలకు విద్యుత్ రాయితీలకు అంగీకారం తెలిపిన కేబినెట్.. యూనిట్కు రూ. 2 చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa