కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జీ. రాగం పేట లో గురువారం అంబటి ఆయిల్స్ నువ్వుల నూనె పరిశ్రమలో జరిగిన ప్రమాదం లో ఏడుగురు కూలీలు ఊపిరాడక మృతిచెందడం వెనుక ట్యాoకులో విషవాయువులే కారణమని ప్రాధమికంగా తెలుస్తుంది. నువ్వులను నూనె గా మార్చే ప్రక్రియలో గానుగ ఆడే ఈ పరిశ్రమలో ముడి నూనెను ట్యాoకులలో నిల్వ ఉంచి రిఫైన్కు పంపుతారు.
అయితే నువ్వులు క్రషింగ్ చేసే ప్రక్రియలో కొన్ని రసాయనాలు కలపడం ఆ తదుపరి రిఫైన్ చేయడంతో రసాయనాలు వేరుచేస్తారు. అయితే గత కొంత కాలo గా పరిశ్రమ మూతబడడం, తిరిగి ఇటీవలే తెరిచేందుకు చేస్తున్న సన్నాహాలలో భాగంగా పాతబడిన ట్యాoకులను శుభ్రపరుస్తుండగా ఒకే సారి ట్యాoకులోకి దిగిన ఏడుగురు కార్మికులు ఊపిరాడక పోవడం తో ఒకరి తరువాత ఒకరు ఇలా కుప్పకూలారు. బయట వీటికోసం ఎదురుచూస్తున్న సహచర కార్మికులకు లోపల ఏమిజరిగిందో అంతుపట్టక లెబోదిబోమంటూ గగ్గోలు పెట్టారు.
కంగారుగా అక్కడకు చేరుకున్న సంస్థ యాజమాన్యానికి ఏడుగురు కూలీలు మృతి చెందడంతో షాక్ చెందారు. పెద్దాపురం పోలీసు ఉన్నతాధికారులు, కాకినాడ నుంచి జిల్లా అధికారులు సంఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై ఆరా తెస్తున్నారు. మృతుల కుటుంబాలకు చెందిన పలువురు రాక, హాహాకారాలతో అంబటి ఆయిల్స్ పరిశ్రమ హృదయవిధారకంగా మారింది. చనిపోయిన ఏడుగురిలో అయిదుగురు విశాఖ జిల్లా పాడేరుకు చెందినవారుగా గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa