రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని పాలన సాగిస్తున్నారని, అర్హత కలిగిన ఏ ఒక్కరికీ ప్రభుత్వం ద్వారా అన్యాయం జరగకూడదని దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి కొనియాడారు.
గురువారం ఆమె ఉత్తర నియోజకవర్గం పరిధిలో సాధికాన కళ్యాణ మండపం వద్ద జరిగిన గృహ సారధుల సమావేశంలో ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త నెడ్ క్యాప్ చైర్మన్ కేకే రాజుతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ బాగుందన్నారు. ఎవరికి ఎలాంటి పథకం వర్తిస్తుందో గుర్తించి ఎంపిక చేయడం జరుగుతోందన్నారు. వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అర్హత ఉండీ సంక్షేమానికి నోచుకోని వారందరినీ గుర్తించేందుకు వాలంటీర్లతో పాటు గృహ సారథులను కొత్తగా నియమించడం జరిగిందన్నారు.
వాలంటీర్లతో కలిసి పనిచేసి మీకు అప్పగించిన గృహాల్లో ఎవరికి ఏ పథకం వర్తిస్తుందో గుర్తించాలన్నారు. ఆ విధంగా ప్రభుత్వం ద్వారా సాయం అందించేందుకు మనం పనిచేయాలన్నారు. వాలంటీర్లతో పాటు గృహ సారథులు సంయుక్తంగా పనిచేసి జగనన్న ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. సిఎం జగన్ అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు అనంతరం వాలంటరీలకు గృహ సారథులకు "మా నమ్మకం నువ్వే జగనన్న" అనే కిట్టు బ్యాగులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, వైఎస్ఆర్సిపి ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు ఉష శ్రీ, ఆళ్ల లీలావతి, అనిల్ కుమార్ రాజు, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఫరూక్, మాజీ కార్పొరేటర్ బొలుసు జగదీష్, మహిళ నాయకురాలు పెడాడ రమణకుమారి వాలంటరీలు గృహసారథులు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa