ఏలూరు లో ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే ..... వివాహమై 9 నెలలు అయింది. భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు. ఆరు నెలలుగా విడిగా ఉంటున్నారు. ఏమైందో ఏమో శనివారం స్నేహితుని గదిలో ఉరివేసుకుని ఓ సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన శనివారం ఏలూరులో సంచలనం కలిగించింది. ఏలూరు టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు రామచంద్రరావుపేట 27వ సచివాలయంలో టౌన్ప్లానింగ్ విభాగంలో దెందులూరుకు చెందిన బావిశెట్టి సుకన్య (27) పనిచేస్తున్నది. గతేడాది రూరల్ మండలం పైడి చింతపాడుకు చెందిన సచివాలయం విలేజ్ కార్యదర్శి బావిశెట్టి వాసుతో వివాహం అయింది. వివాహం అయిన కొద్దిరోజులకే మనస్పర్ధలు రావడంతో ఎవరికి వారు విడిగా ఉంటున్నారు. దీంతో సుకన్య సచివాయలం సమీపంలోని ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నది. స్ధానిక రవి స్వీట్హోమ్ సమీపంలో ఓ ప్రైవేటు కన్స్ట్రక్షన్ నిర్వహించే శంకర్ సుకన్యకు స్నేహితుడు. ఉదయం స్నేహితుని కార్యాలయానికి వెళ్ళింది.ఆ సమయంలో శంకర్ లేకపోవడంతో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్ధానిక ప్రభుత్వా సుపత్రికి తరలించారు. ఇది హత్యా, ఆత్మహత్య అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సుకన్య స్నేహితుడు శంకర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా పెళ్లయిన దగ్గర నుంచి అల్లుడు అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని అతడి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa