జగన్ అరాచకపాలనలో అన్నిరంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయని చెప్పేందుకు ఈ సోదరి మోహన జీవితమే ఒక ఉదాహరణ అన్నారు. పంట నష్టాలు విపరీతంగా రావడంతో చేసిన అప్పులు తీర్చలేక భర్త సోమేశ్వరరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో కుటుంబ పోషణ కోసం మోహన చిన్న టిఫిన్ కొట్టు పెట్టుకుంది. కష్టపడి చదువు పూర్తిచేసిన పిల్లలకు ఉద్యోగాలు రాక తల్లికి చేదోడుగా ఉంటున్నారు. తన కష్టాలన్నీ సోదరి తనతో చెప్పుకుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే బాగుపడతాం అంటూ ఆమె ఆశాభావం వ్యక్తం చేసిందని లోకేష్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa