ఏలూరు జిల్లా, కైకలూరు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జయ మంగళ వెంకటరమణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరారు. వెంకటరమణను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మధ్యవర్తిత్వంతో ఆయన పార్టీలో చేరారు. ప్రస్తుతం జయమంగళ వెంకట రమణ కైకలూరు టీడీపీ ఇన్చార్జిగా ఉన్నారు. కాగా జయమంగళ వెంకట రమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు సీఎం జగన్ హామీ ఇచ్చారు. దీంతో ఆయనకు నలుగురు గన్మెన్లను ప్రభుత్వం కేటాయించింది. స్థానిక సంస్థల్లో ఖాళీ అవుతున్న 8 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి బీసీ వర్గానికి చెందిన వెంకట రమణకు కేటాయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa