ఖాజీపేట మండలం భూమాయపల్లె గ్రామానికి చెందిన తెదేపా మండల నేత మల్లె ఓబయ్య యాదవ్ కు నెల్లూరు పొట్టి శ్రీరాముల జిల్లా గూడూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం రాజంపేటలో విశ్రాంతి పొందుతున్నారు. విషయం తెలుసుకున్న తెదేపా ఆవిర్భావ రాష్ట్ర నేత, ఏపీఎస్ఆర్టీసీ మాజీ జోనల్ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, తెదేపా సీనియర్ నేత, కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ రెడ్యం చంద్రశేఖర్ రెడ్డి, రెడ్యం కుమారుడు రెడ్యం వెంకటసాయి ప్రత్యూష్ రెడ్డి లు మంగళవారం మల్లె ఓబయ్య యాదవ్ నివాస గృహంలో ఆయన్ను పరామర్శించి, జరిగిన సంఘటన గూర్చి తెలుసుకున్నారు.
ఓబయ్య యాదవ్ మంచితనమే కాపాడిందని, స్వల్ప గాయాలతో బయటపడటం సంతోషదాయకం అని పేర్కొంటూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో మల్లె ఓబయ్య యాదవ్ త్వరితగతిన కోలుకోవాలని రెడ్యం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు గంగుల వెంకట్రామయ్య, దాసరి రవి ప్రసాద్ యాదవ్, అప్పనపల్లె సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa