ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఉపాధ్యక్షులు దాడి భానుకిరణ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి, శ్రీధర్ సూచనలతో సంఘం మండలంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ముమ్మరం చేశారు. మంగళవారం సంఘం బంగ్లా సెంటర్ లో సభ్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దాడి భాను కిరణ్ మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వం ప్రతి ఒక్కరు స్వీకరించి పవన్ కళ్యాణ్. కి అండగా నిలవాలన్నారు. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఏ రాజకీయ పార్టీ తీసుకొని నిర్ణయం జనసేన పార్టీ తీసుకుంది. అదే క్రియాశీలక పార్టీ క్రియాశీలక సభ్యత్వం అని తెలిపారు.
పార్టీ జెండా భుజాన మోసే ప్రతి కార్యకర్తల సంకల్పం పట్టుదలను జనసేన ఏనాడు విస్మరించదన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి హజరత్, గురవరాజు, నాయకులు కృష్ణమోహన్, వెంకటేష్, రంతుల్లా, శ్రీను, వెంకట శేషయ్య తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa