ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పడవ మునిగి ఒకరు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 16, 2023, 01:03 PM

ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో ఉన్న సీలేరు నదిలో బుధవారం నాటు పడవ మునిగి ఒకరు మృతి చెందారువివరాల్లోకి వెళ్ళితే..... సరిహద్దుల్లోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్‌ పరిధిలోని స్పీల్‌వే గ్రామానికి చెందిన శ్రుతిరామ్‌(60) రోజూ సీలేరు నదిలో చేపల వేటకు వెళ్లి వస్తుంటాడు. ఇదే క్రమంలో బుధవారం వెళ్లడంతో గాలులు బలంగా వీచి నాటు పడవ బోల్తా పడింది. దీంతో శ్రుతిరామ్‌ నీట మునిగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మల్కన్‌గిరి జిల్లా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాకప సిబ్బంది వెంటనే సంఘటన స్ధలానికి చేరుకుని సీలేరు నదిలో గాలించి శ్రుతిరామ్‌ మృతదేహాన్ని వెలికితీశారు. చిత్రకొండ పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa