ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అధికార మదంతో వైసీపీ నేతలు గుండాల్లా మారారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 16, 2023, 01:03 PM

అధికార మదంతో వైసీపీ నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు గుండాల్లా మారారు అని గురజాల టీడీపీ నాయకులూ యరపతినేని ఆరోపించారు. బుధవారం మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. గురజాల నగర పంచాయతీ పరిధిలో జంగమహేశ్వరపురం గ్రామానికి చెందిన ముగ్గురు టీడీపీ కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు ఇనుపరాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులు చేశారు. ఈ ఘటనలో సంకటి నాగిరెడ్డి కుడికాలు పూర్తిగా విరిగిపోయింది. ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. కరుమూరి రాజశేఖరరెడ్డికి రెండు కాళ్లు, ఎడమచేయి విరిగింది. భవనాసి గోపిరెడ్డి ఎడమ చేయి, కాలికి బలమైన గాయాల య్యాయి. వీరికి గురజాల ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వాలు ఉన్నంత మాత్రాన దాడులకు పాల్పడటం మంచి పద్దతి కాదు అని అయన హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa