ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాలకులు ప్రగతిని మరచి సొంత జేబులు నింపుకునే పనిలో ఉన్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 16, 2023, 01:04 PM

పొన్నూరు 12వ వార్డులో బుధవారం తెలుగుదేశం పార్టీ, మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ఆధ్వర్యంలో ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా వార్డులో విస్తృతంగా పర్యటించిన ఆయన స్థానికులను కలుసుకుని వారి సమస్యలడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నరేంద్రకుమార్‌ మాట్లాడుతూ.....  నిడుబ్రోలు వందెకరాల చెరువు సమీపంలోనే ఉన్నప్పటికీ తాగునీటికి అల్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయన్నారు. వార్డులో మురుగునీటి పారుదల వ్యవస్థ లేక ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని ఆరోపించారు. ఇదే పరిస్థితి పురపాలక సంఘంలోని అన్ని వార్డుల్లో ఉన్నాయన్నారు. పాలకులు ప్రగతిని మరచి సొంత జేబులు నింపుకునే పనిలో ఉన్నారని ఆరోపించారు. పురపాలక సంఘంలో జరుగుతున్న అభివృద్ధి పనుల నాణ్యత, అక్రమాలపై సమగ్ర విచారణ చేసి వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని నరేంద్రకుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షుడు కొత్తపల్లి రాజేష్‌ ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డువాసులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa