అత్యంత పవిత్రమైన దుర్గగుడి పాలక మండలిలో నేరచరిత్ర కలిగిన వ్యక్తులను నియమించడం శోచనీయమని, ప్రభుత్వం తక్షణమే స్పందించి పాలక మండలి సభ్యులను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు డిమాండ్ చేశారు. ధర్నాచౌక్లో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ధర్నా చేశారు. దుర్గగుడికి ఐఏఎస్ స్థాయి అధికారిని ఈవోగా తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. నాయీబ్రాహ్మణులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయ పాలకమండలి కమిటీల్లో చోటు కల్పించక పోవడం సరికాదన్నారు. నేరచరిత్ర కలిగిన వారిని పాలకమండలి నుంచి తొలగించే వరకు న్యాయ పోరాటం చేస్తామన్నారు. పార్టీ సీనియర్ నేత వి.గురునాథం తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa