గెలుపే ధ్యేయంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ నాయకత్వం నజర్ పెట్టింది. ఇదిలావుంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థుల విజయం ఖాయమని.. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రులంతా జగన్ విశాల దృక్పథాన్ని గమనించాలని కోరారు వై.వీ.సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో.. విశాఖపట్నంలో ఎన్నికలపై కీలక సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు.
'ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీతంరాజు సుధాకర్ను పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ 20 రోజులు పార్టీ నాయకులు అయా నియోజకవర్గాల్లో ఓటర్లను కలిసి మెజార్టీ సాధించే దిశగా పని చేయాలి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల కోసం విశాఖలో వైఎస్సార్సీపీ ప్రత్యేక కార్యాలయం అందుబాటులో ఉంటుంది' అని వైవీ సుబ్బారెడ్డి వివరించారు.
'ఈసీ సమావేశాలు పెట్టుకుంటుంది. అది నిరంతర ప్రక్రియ. చేత కాని వారు ఫిర్యాదు చేయక ఇంకేం చేస్తారు?. మేం ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించం. ఎప్పుడూ చట్టబద్ధంగా నడుచుకుంటాం. ఈ ఎన్నికల్లో 200 శాతం మేం గెలుస్తాం. రాజధాని అంశాన్ని రెఫరెండంగా ఎందుకు తీసుకోవాలి?. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. గతంలో మా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇప్పుడు మాకు అభ్యర్థి ఉన్నారు' అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
'ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. సీతంరాజు సుధాకర్ను బలపరుస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఆయనను గెలిపించుకుని ఈ ప్రాంతానికి మా పార్టీ, ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను అందరూ గుర్తించేలా చేయాలని నిర్ణయించాం. అనేక దశాబ్ధాలుగా వెనకబడి ఉన్న ఈ ప్రాంత అభివృద్ధి కోసం సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధిస్తాం' అని ధర్మాన ప్రసాదరావు ధీమా వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa