తిరుపతి నగరం ముత్యాలరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనలక్ష్మినగర్లో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు సోమవారం రాత్రి దాడి చేశారు. వ్యభిచారం నిమిత్తం తెచ్చిన ఇద్దరు మహిళలు, ఓ విటుడు, వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ప్రశాంత్ అనే యువకుడు, అతని తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ నగరంలోనే పనిచేస్తున్న ఓ మహిళా ఎస్ఐకి తమ్ముడు కావడం చర్చనీయాంశమైంది. అయితే, ఏడాది క్రితం వివాహం చేసుకున్న ఆ మహిళా ఎస్ఐ కొంతకాలంగా తల్లి, సోదరుడితో సంబంధం లేకుండా దూరంగా ఉంటున్నట్టు తెలిసింది. కర్నూలుకు చెందిన ప్రశాంత్, అతని తల్లి కొంతకాలంగా తిరుచానూరులోని లింగేశ్వర్నగర్లో ఉంటూ, మూడు నెలలక్రితం ధనలక్ష్మినగర్కు మకాం మార్చినట్టు సమాచారం. ధనలక్ష్మినగర్లోని అద్దె ఇంట్లో వీరు వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తుండడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు మహిళలను ప్రభుత్వ గృహానికి పంపించామని, నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని సీఐ సురేంద్రనాథరెడ్డి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa