తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, పొత్తు ఉంటే జగన్ రాక్షస పాలన నుంచి విముక్తి పొందవచ్చని ఆశిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. రాక్షస పాలన వదిలించుకోవాలంటే ఓటు చీలకుండా అందరూ కలిసి రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారన్న విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు, పవన్ కలిసి కూర్చుని మాట్లాడుకుని ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని సూచించారు. జగన్ రాష్ట్రమంతటా పులివెందుల సంస్కృతి తీసుకొచ్చారని విమర్శించారు. రాక్షసుడి పాలన నుంచి విముక్తి పొందాలన్నా... అమరావతి అభివృద్ధి జరగాలన్నా అన్ని పార్టీలు ఏకం కావాలన్నారు. తాను జనసేన పార్టీలో చేరడానికి ప్రయత్నించానన్న విషయం వాస్తవం కాదని స్పష్టం చేశారు. నాదెండ్ల మనోహర్, తాను వ్యక్తిగతంగా మంచి స్నేహితులమని, అనేకసార్లు స్నేహపూర్వకంగా కలిశామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa