ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ లోకి చేరిన వైసీపీ కార్యకర్తలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2023, 02:47 PM

టీడీపీ యువ నాయకుడు భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం 42వ వార్డుకు చెందిన యువత పెద్దఎత్తున  టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం 42వ వార్డుకు చెందిన 200 మంది యువకులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకుడు భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి వార్డులో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రసాద్‌, మద్దిలేటి, పుల్లయ్య, హేమంత్‌, కృష్ణారెడ్డి, వెంకటేశ్వరమ్మ, కృష్ణారెడ్డి, ఎల్లారెడ్డి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa