ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రసవ సమయంలో, వైద్యుల నిర్లక్ష్యం తో మహిళా పోలీసు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2023, 02:49 PM

వైద్యం వికటించి మహిళ మృతి చెందిందని ప్రొద్దుటూరు, మైలవరం మండలం వేపరాలకు చెందిన బాధితులు ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట శుక్రవారం ఆందోళనచేపట్టారు. కొండాపురం మండలం చౌటుపల్లెలో మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్న స్వర్ణకుమారిని ప్రసవానికి ప్రొద్దుటూరుకు తీసుకొచ్చా రు. గురువారం రాత్రి 8.30గంటలకు బిడ్డను తీసుకొచ్చి తల్లీబిడ్డ క్షేమమని డాక్టర్లు చెప్పారని బాధితులు చెబుతున్నారు. గంట తరువాత తల్లికి  సీరియస్ గా ఉందని చెప్పిన డాక్టర్లు మరికొద్ది సేపటి తరువాత ఏం పర్వాలేదు బాగుందని చెప్పారు. మళ్ళీకొద్దిసేపటికి గర్భసంచి తొలగించాలనిచెబుతూ రాత్రి 9.30గంటలకు సీరియ్‌సగా ఉంది, ఎక్కడికైనా తీసుకెళ్లాలని సూచించారన్నా రు. మెరుగైన వైద్యం కోసం బెంగుళూరుకు తరళిస్తుండగా స్వర్ణకుమారి మృతి చెందినట్లు బాధితులు వివరించారు. ఆపరేషన్‌ సమయంలోనే తప్పు చేశారని, దీంతోనే తమ బిడ్డ మృతిచెందిందని ఆరోపిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa