రాష్ట్రం అన్ని రంగలల్లోను వెనుకబడిపోయిందని, జగన్ పరిపాలనలో అభివృద్ధి పూర్తిగా కుటుంపడిందని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక 9వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భవాని పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ తమ నాయకుడు చంద్రబాబు హయాంలో రాష్ట్రం అన్నివిధాల అభివృద్ధి చెందితే అటుపై అధికారంలోకి వచ్చిన జగన్ పూర్తిగా వైఫల్యం చెంది రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని, సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ఎటు చూసినా సమస్యలు తాండవిస్తున్నాయన్నారు. సంక్షేమ పథకాలకు అర్థంపర్ధంకాని నిబంధనలతో అర్హులకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ప్రజలు నమ్మి జగన్కు అధికారమిస్తే వారికి నమ్మక ద్రోహం చేశారని విమర్శించారు. ప్రజలు దేనిని మర్చిపోరని 2024 ఎన్నికల్లో జగన్కు గట్టిగా బుద్దిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తుందని ప్రజల సమస్యలను తమ నాయకుడు చంద్రబాబు తీరుస్తారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ డివిజన్ కమిటీ అధ్యక్షుడు మరుకుర్తి శివకుమార్ యాదవ్, దుంగా నవీన్, దొడ్డి వీర్రాజు, దొడ్డి భవానిశంకర్, నెల్లి సరస్వతి, దొడ్డి దేవుడమ్మ, కుంచల మేరీ, పరమేశ్వరి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa