సీఎం జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును చెడగొడుతున్నారని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. తన తండ్రి వైఎస్సార్ కంటే మంచి పరిపాలన చేస్తానన్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని ఫైరయ్యారు. శనివారం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ..
ఇక, తప పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ అసభ్య, అభ్యంతరకరమైన భాష వాడుతోందని కన్నా లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు. టీడీపీ ఆఫీసులపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయకుండా, బాధితులనే అరెస్ట్ చేయడం రాక్షస పాలనకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఇక, సీఎం జగన్మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం అరాచక పాలనకు పరాకాష్ట అని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ప్రజల సొమ్మును ప్రజలకే పంచుతూ.. తన ఇంటి నుంచి ఇస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారని దుయ్యబట్టారు. పైగా పథకాల పేరుతో గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఓట్ల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి పాలన అవసరమా అని ప్రజలు ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa