త్వరలో జరగనున్న ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్దేశించిన పార్టీ అభ్యర్థి సీతoరాజు సుధాకర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వెంకట చిరంజీవి నాగ్ సూచించారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. ఆదివారం ఆమదాలవలస తన స్వగృహంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర గొంతు బలంగా వినిపించాలన్న, ఈ ప్రాంతం సమస్యలపై మండలి లో చర్చ జరగాలన్న సుధాకర్ వంటి వ్యక్తుల సేవలు అవసరం ఉందన్నారు. చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కని పాలన జరుగుతోందన్నారు. ప్రజల్లో వైయస్ జగన్ ప్రభుత్వం పై ఉన్న సానుకూల ధోరణిని ఓట్ల రూపంలో తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతీ గడపకూ తీసుకెళ్లాలని, ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా కలిసి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు. రాబోయే రోజుల్లో సచివాలయ కన్వీనర్లు, గృహ సారధుల పాత్ర కీలకం కానుందని చెప్పారు. సీఎం జగన్ లాంటి ధైర్యమైన నాయకుడు ఉండడం సంతోషదాయకమన్నారు. జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. జగన్ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమన్నారు. సీఎం జగన్ పాలన ఆదర్శంగా, పారదర్శకంగా కొనసాగుతోందన్నారు. సీఎం జగన్ బలమైన నాయకుడు అయినందునే శత్రువులు ఏకమయ్యారన్నారు. ఎనభై శాతం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తేవడానికి పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలన్నారు. వైఎస్ఆర్ సిపిలో కష్టపడి పనిచేసిన వారికి తగిన సమయంలో తగిన గుర్తింపు, విలువ ఉంటుందన్నారు. వార్డు సచివాలయం కన్వీనర్ డిసిసిబి డైరెక్టర్ బొడ్డేపల్లి నారాయణరావు, దుంపల శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa