ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజాం జాతరకు భారీ పోలీసు బందోబస్తు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2023, 05:03 PM

రాజాం పైడితల్లి అమ్మవారి 97వ జాతర మహోత్సవాలు ఆదివారం నుంచి మంగళవారం వరకు జరగనున్నాయి. మూడు రోజుల పాటు జరగబోయే పైడితల్లి అమ్మవారి జాతరకు పూర్తిస్థాయిలో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు. సిఐలు, ఎస్సైలు, ఏఎస్ఐ, హెచ్సిలతో పాటు కానిస్టేబుళ్లు, హోంగార్డులు, మహిళా కానిస్టేబుల్, మొత్తం 320 మంది సిబ్బందితో యాత్రని నిరంతరం పర్యవేక్షిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa