మరో ప్రముఖ కంపెనీకి విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. ఇదిలావుంటే ప్రముఖ ఉక్కు ఉత్పత్తి సంస్థ శ్యామ్ స్టీల్ దక్షిణాదిలో తమ వ్యాపారాన్ని విస్తరించుకోవాలని ప్రమాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ముందుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తమ రిటైల్ వ్యాపారాన్ని మరింత విస్తరించనుంది. వచ్చే ఐదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో 500లకు పైగా డీలర్ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్లను ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ డైరెక్టర్ లలిత్ బెరివాలా వెల్లడించారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా ప్రస్తుతం ఉన్న 7 లక్షల టన్నుల నుంచి వచ్చే నాలుగేళ్లలో 13.5 లక్షల టన్నులకు పెంచుకుంటామని తెలిపారు. ముందుగా ఏపీ, తెలంగాణల్లో రిటైల్ వ్యాపారాన్ని విస్తరించి.. ఆ తర్వాత దక్షిమ భారతంలో నెట్వర్క్ను పెంచుకుంటామన్నారు.
కంపెనీ విస్తరణలో భాగంగా ఉత్పత్తి సామర్థ్యాల పెంపునకు రూ.2,500 కోట్లు మేర వెచ్చించే యోచనలో ఉన్నట్లు వివరించారు డైరెక్టర్ లలిత్ బెరివాల. పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో ఉన్న కంపెనీ ప్లాంట్పై రూ. 1,000 కోట్లుతో పాటు మరో ప్లాంట్పై రూ.1,500 కోట్లు పెట్టుబడి పెడుతున్నామని చెప్పారు. ప్రస్తుతం కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం 0.7 మిలియన్ టన్నులుగా ఉండగా దానిని 1 మిలియన్ టన్నులకు పెంచుకుంటామని చెప్పారు. గత ఆర్థిక ఏడాదిలో రూ.4,500 కోట్ల టర్నోవర్ వచ్చిందని, వచ్చే మూడేళ్లలో దీన్ని రూ.9 వేల కోట్లకు పెంచుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు బెరివాలా. టీఎంటీ బార్స్కు పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా రానున్న అయిదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లను ఏర్పాటు చేసుకుంటామన్నారు.
ప్రముఖ ఉక్కు ఉత్పత్తి సంస్థ శ్యామ్ స్టీల్ ఇండస్ట్రీస్ ఉత్పత్తులకు ప్రచారకర్తగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండను నియమించుకున్నట్లు సంస్థ డైరెక్టర్ లలిత్ బెరివాలా తెలిపారు. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విస్తరణకు ప్రణాళికలు చేస్తున్న క్రమంలో ఆయనను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నామని పేర్కొన్నారు. దక్షిణాధి రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ఇది తమకు ఎంతగానే ఉపయోగపడుతుందని వివరించారు.
మరోవైపు.. వాణిజ్య ప్రకటనకర్తలకు, తయారీదారులకు, సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్ర సర్కార్ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. వాణిజ్య ప్రకటనలు వినియోగదారులను పక్కదోవ పట్టించేలా ఉండకూడదని స్పష్టం చేసింది. ప్రకటనలను హ్యాష్ట్యాగ్లు, లింకులతో నింపేయకూడదని, దాని ద్వారా వినియోగదారులు నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ మేరకు అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో కేంద్ర సర్కార్ వినియోగదారుల వ్యవహారాల సెక్రెటరీ రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa