కాకినాడ దగ్గరలోని కోట రామ చంద్రాపురం గ్రామంలో విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళ్ళితే.... కోలా ఉదయ్ (20) దెందులూరులోని ఒక స్వీట్ హోమ్లో స్వీట్లు తయారు చేసే పనికి చేరాడు. ఉదయ్తో పాటు గోవింద్, అభి దెందులూరులోని గ్రీన్ సిటీలోని ఒక ఇంట్లో సెకండ్ ఫ్లోర్లో అద్దెకు ఉంటున్నారు. సోమవారం రాత్రి పని ముగించుకుని 10 గంటలకు ఇంటికెళ్లి పోయారు. మంగళ వారం తెల్లవారు జామున మేడపై నుంచి కింద పడి ఉదయ్ మృతి చెందాడు. ఉదయ్తో పాటు ఉండే అభి శనివారం ఊరు వెళ్లగా గదిలో గోవింద్ ఉన్నాడు. తెల్లవారు జామున లేచి చూసేసరికి కిందపడి చనిపోయి ఉన్నాడని అయితే ఉదయ్ మద్యం బాగా సేవించి ఉన్నాడని మంచినీళ్ల కోసం లేచి కాలు జారి కింద పడిపోయి ఉండవచ్చని గోవింద్ చెబుతున్నాడు. సమాచారం తెలుసుకున్న దెందులూరు పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న దెందులూరు ఎస్ఐ వీర్రాజు తెలిపారు. ఏప్రిల్ నెలలో ఉదయ్ చెల్లి పెళ్లి ఉంది. పెళ్లి బాగా చేయాలని కుటుంబానికి ఆసరాగా ఉండాలని స్వీట్హోమ్లో పనికి కుదిరాడని నెల రోజుల్లోనే మృతి చెందడంతో మృతుడు ఉదయ్ తల్లిదండ్రుల ఆర్తనాదాలు కంటతడి పెట్టించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa