నిన్న పీఎం పంచిన సొమ్ముకు నేడు బటన్ నొక్కుడు ఏమిటి అని ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామా నాయుడు ప్రశ్నించారు. ప్రధాని మోదీ సోమవారం రైతులకు రైతు భరోసా పేరుతో కర్నాటకలో జాతీయ స్థాయిలో బటన్ నోక్కి రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేశారనీ, దానినే నేడు సీఎం జగన్ తెనాలిలో బటన్ నొక్కి రైతులకు మేలు చేస్తున్నామని పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చుకోవడం దేనికని ఆయన ప్రశ్నించారు. తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిమ్మల మాట్లాడుతూ, కేంద్రం ఇచ్చిన రూ. రెండు వేలకు అనదనంగా మరో రెండు వేలు కలిపి మీ బటన్ నొక్కుడు ద్వారా రైతులకు ఇవ్వక పోవడం దగా, మోసం కాదా అని ప్రశ్నించారు. రైతులధాన్యం సొమ్ము రూ.55 వేల కోట్లు కూడా రైతులకు (తాము ఇచ్చినట్టు)ఆర్ధిక సహాయంగా ప్రకటనలు చేసుకోవడం జగన్ దిగజారుడికి నిదర్శనమని నిమ్మల అన్నారు. ముందుగా 65 లక్షల మంది రైతులకు సహాయం అని ప్రకటనలు చేసి 45 లక్షల మందికి మాత్రమే రైతు భరోసా ఇవ్వడం దగా కాదా అని నిలదీశారు. రూ. 13,500 రైతు భరోసా అని చెప్పి, రూ7.500 మాత్రమే ఒకొక్క రైతుకు ఏడాదికి రూ.6వేలు చొప్పన ఐదేళ్లలో రూ. 30 వేలు రైతు నష్ట పోతున్నాడని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa