ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండు చోట్ల ఓడిన పవన్‌ గురించి అడగొద్దు.. మంత్రి కాకాణి గోవర్ధన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2023, 05:39 PM

రెండు చోట్ల ఓడిన పవన్‌ గురించి అడగొద్దు, ఆయన గురించి నన్ను అడిగి అవమానించొద్దు అని రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్ధన్ కోరారు.  రెండు చోట్ల ఓడిన పవన్‌ గురించి అడగొద్దు రెండు సార్లు గెలిచిన నన్ను.. రెండు చోట్ల ఓడిన పవన్‌ గురించి అడగొద్దు.. అన్నిస్థానాల్లో పోటీ చేస్తారా అంటూ.. చంద్రబాబును అడిగారు.. కానీ, పవన్‌ను అడగలేదు.. అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పవన్‌ను అసలు రాజకీయ నాయకుడిగా తాము గుర్తించడం లేదని స్పష్టం చేశారు. ఎవరు పొత్తు పెట్టుకున్నా.. ఒంటరిగా వచ్చినా.. తాము మాత్రం దమ్ముగా సింగిల్‌గానే వస్తామని ఆయన వ్యాఖ్యానించారు.


'పవన్ కళ్యాణ్ ఒక జోకర్. రెండు చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి గురించి.. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేను ఎలా మాట్లాడాలి. పవన్ గుర్తించాల్సిన అవసరం మాకు లేదు. అసలు జనసేన పార్టీని ఒక రాజకీయ పార్టీగా మేము భావించడం లేదు. 2014కు ముందు ఆయన పార్టీ పెట్టారు. కానీ.. 2014లో పోటీ చేయలేదు. 2019లో పోటీ చేసినా.. అప్పటి అధికార పార్టీకి లాభం చేకూరేలా వ్యవహరించారు. అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు చీల్చారు. అందుకే ఆయన్ను గుర్తించాల్సిన అవసరం లేదు' అని కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.


'లోకేష్ పాదయాత్రకు బయటి రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చుకుంటున్నారు. చంద్రబాబు చెప్పినప్పుడు కూడా ఇదే విషయం స్పష్టమైంది. వారు నియమించుకున్న వాలంటీర్లకు రోజుకు రూ.2 వేలు ఇస్తున్నారు. అయినా ఉపయోగం లేకుండా పోతోంది. చంద్రబాబు ప్రజాదరణ కోల్పోయారు. చంద్రబాబు ఇప్పటికీ ఓటమిని, వైఫల్యాన్ని ఒప్పుకోవడం లేదు. చంద్రబాబు ఎప్పుడూ మిగతావాళ్ల కష్టం మీద నిలబడే వ్యక్తి. ఆయన సొంతంగా పార్టీ పెట్టలేదు.. సొంతంగా అధికారంలోకి రాలేదు' అని మంత్రి కాకాణి వ్యాఖ్యానించారు.


'ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటున్నాం. జగన్‌కు చిత్తశుద్ధి ఉంది. నమ్మక ద్రోహం చేయడం, వంచించడం జగన్‌కు అలవాటు లేదు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే జగన్ విసిరిన సవాల్‌ను స్వీకరించాలి. మాకు అసలు ఎవరితో పొత్తు అవసరం లేదు. రాష్ట్ర ప్రజలను అడిగినా ఇదే చెబుతారు. మేము ఎప్పుడూ ఎవరితో కలవబోం. ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పాం.. వాళ్లు పొత్తులు పెట్టుకున్నా.. మాకు ఎలాంటి సమస్య లేదు. ఇప్పటికే చంద్రబాబు ఎన్నో పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. రాజకీయాల్లో చంద్రబాబు హీనుడు. ఆఖరికి రైతులకు నిధులు జమ చేసినా.. దానిపై రాజకీయం చేస్తున్నారు' అని కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa