గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు విశాఖ ముస్తాబయింది. ఇదిలావుంటే విశాఖపట్నంలో ఈనెల 3, 4 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా.. భారీగా పెట్టుబడులను ఆకర్షించాలని జగన్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇటు సమ్మిట్కు విశాఖ నగరాన్ని ముస్తాబు చేస్తోంది. సదస్సు ప్రాంగణంలో.. రాష్ట్ర హస్తకళలు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఈ ప్రాంగణంలోనే ముఖ్యమంత్రి కూడా ఉండనున్నారు. ఇందులో సీఎంకు ప్రత్యేక గదితో పాటు, సమావేశ మందిరం ఉంటాయి. పరిశ్రమలు, ఆర్థిక శాఖ మంత్రులతో పాటు, చీఫ్ సెక్రటరీ, ఉన్నతాధికారులకు ప్రత్యేక లాంజ్లు, ఐదో ప్రాంగణంలో 390 మంది కూర్చొనేలా సెమినార్లకు ఏర్పాట్లు చేస్తున్నారు.
గ్లోబర్ ఇన్వేస్టర్ సమ్మిట్ నిర్వహణ బాధ్యతను టైమ్స్ నెట్వర్క్ సంస్థకు అప్పగించారు. పారిశ్రామిక వేత్తలు విశాఖలో అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు.. వసతి, ఆతిథ్యం ఇలా అన్ని సౌకర్యాలు ఈ సంస్థ చూసుకోనుంది. గెస్ట్ల రవాణా, వసతి సౌకర్యాలకు కనీసం రూ.5 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో 352 వాహనాలను అధికారులు సమీకరిస్తున్నారు. ముఖేష్ అంబానీ, నవీన్ జిందాల్, మిట్టల్, అదానీ వంటి పారిశ్రామిక దిగ్గజాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నుంచి 30 వరకు బెంజి, ఆడి కార్లను రప్పిస్తున్నారు.
విశాఖ వచ్చే.. పారిశ్రామిక ప్రముఖులకు 17 హోటళ్లలో 559 గదులు తీసుకోగా.. అత్యధికంగా నోవోటెల్లోనే ఉన్నాయి. ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2వ తేదీ రాత్రి విశాఖ చేరుకుంటారు. పోర్టు అతిథి గృహంలో బస చేస్తారు. 3, 4 తేదీల్లో జరిగే సదస్సులో పాల్గొని 4న రాత్రి తిరుగు ప్రయాణం కానున్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్రెడ్డి, పీయూష్ గోయల్, సోనావాలా, ప్రహ్లాద్జోషి, ఆర్.కె.సింగ్, రాష్ట్ర మంత్రులు కూడా 2వ తేదీ రాత్రికే విశాఖ నగరానికి చేరుకుంటారని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa