చరిత్ర సృష్టించిన పార్టీపై సీఎం జగన్ సవాళ్లు చేయడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. ఇదిలావుంటే చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్కు దమ్ముంటే.. 175 స్థానాల్లో పోటీ చేయాలని.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. జగన్ విసిరిన సవాల్పై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. తాజాగా.. టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి జగన్ కామెంట్స్పై కాస్త ఘాటుగా స్పందించారు. చరిత్ర సృష్టించిన పార్టీపై సవాళ్లు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చరిత్ర తెలుసుకొని సవాల్ చేస్తే బాగుండేదని ఆయన హితవు పలికారు.
'మా పార్టీ అనుభవమంత లేదు నీ వయసు. నువ్వు డైపర్స్ వేసుకొనేటప్పుడు పుట్టిన తెలుగుదేశం పార్టీని నువ్వెందయ్యా ఛాలెంజ్ చేసేది? అంత సీన్ నీకు లేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటెందుకు నమోదు చేసుకోలేదో చెప్పే ధైర్యం ఉందా? జగన్ పదో తరగతి ఫెయిల్ కావడం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోలేదు. రాష్ట్రంలో పరిస్థితి మారాలంటే సైకిల్ రావాలి' అని తెలుగుదేశం పార్టీ నేత ఆనం వెంకటరమణారెడ్డి వ్యాఖ్యానించారు.
ఆనం వెంకటరమణారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 1983 నుంచి.. 2018 వరకు తెలుగుదేశం పార్టీ ఏయే పార్టీలతో పొత్తు పెట్టుకుందో వివరిస్తూ.. రిప్లై ఇస్తున్నారు. ఇటు.. ఒక్క 2019 ఎన్నికలు మినహా.. మిగతా అన్ని ఎలక్షన్లలో టీడీపీ ఏదో ఒక పార్టీతో పొత్తులో ఉందని గుర్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa