విశాఖలో ఈ నెల 3, 4 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 లో అడుగడుగునా రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా బుధవారం పలు అంశాలను ఆయన వెల్లడించారు. బ్యాడ్జీలు దగ్గర నుంచి కిట్లు వరకు రాష్ట్ర సంస్కృతి దర్శనమిచ్చేలా డిజైన్ చేయడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరిచిందని అన్నారు. అతిధులకు ఇచ్చే గిఫ్ట్ బాక్స్ లపై పెడన కలంకారీ డిజైన్, ముఖ్య అతిథులకు సిల్వర్ ఫలిగ్రీతో చేసిన జీఐఎస్ లోగో తో ఉన్న బహుమతులు అందించనున్నారని అన్నారు.
రానున్నవి పేదలకు, పెత్తందార్లకు మధ్య జరగనున్న ఎన్నికలని విజయసాయిరెడ్డి అభివర్ణించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించి ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని ఆయన అన్నారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యముందా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ ప్రతిపక్షాలు స్వీకరించగలవా అని ప్రశ్నించారు. వైఎస్సార్ (యువజన శ్రామిక రైతు) కాంగ్రెస్ పార్టీ పేరులోనే రైతు ఉందని, తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని అన్నారు. దేశ వ్యాప్తంగా పిల్లలు, యువకులకు ఉపయోగపడేలా నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన అభినందనీయమని డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయడం ద్వారా దేశ వ్యాప్తంగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పు రానుందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa