ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ సచివాలయ ఉద్యోగుల నేతలతో ముగిసిన మంత్రి బొత్స భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2023, 09:02 PM

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ చర్చలు ముగిశాయి. అనంతరం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడ్తూ 94 ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను ప్రభుత్వానికి నివేదించారు. వాటిలో ఇప్పటి వరకు 24 పరిష్కారమయ్యాయని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపినట్లు వెంకట్రామి రెడ్డి తెలిపారు. పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అంగీకరించామని, 13 వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారని వివరించారు. పెండింగ్‌లో ఉన్న 2 డీఏలను త్వరలో ఇస్తామని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa