శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండలం రావివలసకు చెందిన నార్ల పుణ్యావతి (49) తీవ్ర అస్వస్థతకు గురై గురువారం రాత్రి మృతిచెందారు. వివరాల్లోకి వెళ్ళితే.... గత నెల 19న గ్రామానికి చెందిన పలువురితో కలిసి ఈమె తిరుమల శ్రీవారి సేవకు వెళ్లారు. సేవ అనంతరం ఈనెల 1న తిరుపతిలో బయలు దేరి రైలులో స్వగ్రామానికి వస్తున్న సమయంలో మార్గ మధ్యంలో తీవ్రఅస్వస్థతకు గురయ్యారు. ఆమెతో ఉన్న గ్రామస్థులు గురువారం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అపస్మార స్థితికి చేరుకున్న ఆమె అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. పుణ్యావతి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతురాలి భర్త కామేశ్వరరావు గత కొన్నేళ్ల కిందటే మృతి చెందగా ఈమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శుక్రవారం రావివలస గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa