నెల్లూరు జిల్లా, అల్లూరు మండలంలో బీరంగుంట పంచాయతీ రైస్మిల్లు కాలనీవద్ద శుక్రవారం వేకువజామున అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి కథనం మేరకు, విడవలూరు మండలం పార్లపల్లికి చెందిన జానా నాగరాజు, సాయి అనే యువకులు వావిళ్లలోని ఓ దుకాణంలో 150 మద్యం సీసాలను కొనుగోలు చేసి, అల్లూరులో అధిక ధరలకు విక్రయించేందుకు ద్విచక్రవాహనంపై తరలిస్తుండగా అదుపుతప్పి పడిపోయారు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా యువకులు గాయాలపాలై అక్కడే పడి ఉండడంతోపాటు 150 మద్యం సీసాలు ఉన్నట్టు గుర్తించి సీజ్ చేశారు. అందులో కొన్ని పగిలిపోగా వాటితోపాటు మొత్తం సీసాలను, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మద్యం విక్రయించిన దుకాణం సేల్స్మన్ కాటంగారి మహేష్ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, హేమచంద్ర తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa