ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 02:57 PM

ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు గిద్దలూరు లోని ఎమ్మెల్యే నివాసంలో శనివారం కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. త్వరలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించే విధంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరిని ఓటు వేసే విధంగా చూడాలని అన్నారు. సీఎం జగన్ ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని కార్యకర్తలతో అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa