ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ ఆరు వరుసల జాతీయ రహదారి మంజూరు చేసిన కేంద్రం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 02:59 PM

విశాఖపట్నం పోర్టు నుంచి భోగాపురం వరకు ఆరు వరుసల జాతీయ రహదారి కావాలని రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా కోరుతున్నదని, దానిని ఇప్పుడు మంజూరు చేస్తున్నామని కేంద్ర రవాణా,రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఈ ఆరు వరుసల హైవే పొడవు 55 కిలోమీటర్లని, నిర్మాణానికి రూ.6,300 కోట్లు ఖర్చు అవుతాయన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా భూమిని సమకూర్చాల్సి ఉంటుందన్నారు. విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సదస్సుకు హాజరైన ఆయన పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడారు. 157 ఎకరాల్లో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కును ఏర్పాటు చేయనున్నట్టు గడ్కరీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తున్నదని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa