ట్రెండింగ్
Epaper    English    தமிழ்

28 కేజీల గంజాయి స్వాధీనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 05:02 PM

వైఎస్సార్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు చేస్తున్న 19 మంది అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. శనివారం కడప నగరంలోని పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ. 28 కేజీల గంజాయి, పోర్డ్ కారు, 4 బైక్ లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కమలాపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఐదుగురు, కడప వన్ టౌన్ లో ఐదుగురు, పోరుమామిళ్ల లో 8 మంది, సిద్ధవటంలో ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 40మంది స్పెషల్ టీమ్, ఎస్. ఈ. బి సంయుక్త ఆపరేషన్లో అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు చేసినట్లు తెలిపారు. గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న వారే కాకుండా, చిన్న చిన్న పొట్లాల్లో విక్రయిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్టు అయిన నిందితుల సమాచారంతో మరికొందరిపై నిఘా పెట్టడం జరిగిందన్నారు. వైజాగ్ నుంచి ట్రైన్, కార్లలో రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలింది అని అన్నారు. గంజాయి వినియోగిస్తున్న 30 మందికి రిహాబిలిటేషన్ సెంటర్ లో కౌన్సిలింగ్ ఇస్తాం అన్నారు. ప్రజలు గంజాయి విక్రయాలు, వినియోగించే వారి సమాచారం డయల్ 100 లేదా తన ఫోన్ నెంబర్ 9440796900 కు ఇవ్వాలని జిల్లా ఎస్పీ సూచన చేశారు.


స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ పూజిత నీలం ఆధ్వర్యంలో గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుండి గంజాయి, కారు, మోటార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఫ్యాక్షన్ జోన్ డి. ఎస్పీ చెంచుబాబు, కడప డి. ఎస్పీ బి. వెంకట శివారెడ్డి, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, ఎస్. బి ఇన్స్పెక్టర్ రాజా ప్రభాకర్, కడప వన్ టౌన్ సి. ఐ నాగరాజు, కమలాపురం సి. ఐ సత్యబాబు, మైదుకూరు సి. ఐ చలపతి, ఎస్. ఈ. బి ఇన్స్పెక్టర్ ఉరుకుందమ్మ, ఎస్. ఐ లు పెద్ద ఓబన్న, మధుసూదన్ రెడ్డి, గణ మద్దిలేటి, ఆర్. ఎస్. ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది ని జిల్లా ఎస్. పి ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులు అందచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa