ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంటను పరిశీలంచిన వ్యవసాయ అధికారి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 05:04 PM

ముద్దనూరు మండలంలోని కొర్రపాడు గ్రామంలో రభిలో సాగు చేసిన ఆముదం పంటను మండల వ్యవసాయ అధికారి మారెడ్డి. వెంకటకృష్ణారెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.. గ్రామంలో రైతులు ఆముదం పంట సాగుచేశారు. అముదం పంటను పరిశీలించి రైతుకు తగు సూచనలు, సలహాలు తెలిపినట్లు తెలిపారు. పంటలో రసము పీల్చే పురుగుల ఉదృతి, మరియు పేనుబంక, పచ్చదోమ అధికముగా ఉందని వీటి నివారణకు ఇమిడా క్లోపిడ్ అనే మందును 0. 4 యమ్. యల్. ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ యంపీఈఓ యల్. నాగ స్వర్ణ, మరియు యువ రైతు యెదురు. సందిరెడ్డి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa