ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మ చనిపోయినా గుర్తించలేని బాలుడు,,,కన్నీళ్లు పెట్టిస్తున్న ఆ ఘటన

national |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 09:11 PM

ఊహతెలియని వయస్సులో తండ్రి పోయాడు...అదే ఊహ తెలియన వయస్సులో తల్లి చనిపోయినా ఆ బాలుడు గుర్తించలేని పరిస్థితిలో ఉండి పోయాడు. ఈ ఘటన అందరి కంట నీళ్లు తెప్పిస్తోంది. తన తల్లి చనిపోయిన విషయం గుర్తించలేని అభంశుభం తెలియని ఓ పసిపాడు.. రెండు రోజులపాటు ఆమె మృతదేహంతోనే ఉన్నాడు. తల్లిబతికే ఉందని భావించిన ఆ బాలుడు.. అమ్మ వంట చేయలేదని చెప్పి పక్కింటికి వెళ్లి తిని వచ్చాడు. చివరకు తల్లి శరీరం నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారికి ఆ చిన్నారి సమాచారం అందించాడు. దీంతో ఆ ఇంటిలోకి వారు వెళ్లి చూసేసరికి అసలు విషయం తెలిసింది. దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు. హృదయాలను కలిచివేసే ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.


బెంగళూరులోని గంగానగర్కు చెందిన అన్నమ్మ (40) అనే మహిళ భర్త ఏడాది కిందటే కిడ్నీ వ్యాధితో కన్నుమూశాడు. అప్పటి నుంచి తన 11 ఏళ్ల కుమారుడితో కలిసి ఒంటరిగా జీవనం సాగిస్తోంది. కూలీ పనులు చేసుకుంటూ కుమారుడ్ని పెంచుకుంటోంది. అయితే, ఫిబ్రవరి 25న పనికి వెళ్లొచ్చిన అన్నమ్మ ఆ రోజు రాత్రి తన ఇంట్లో కుమారుడితో కలిసి నిద్రపోయింది. అయితే, అన్నమ్మ అదే రోజు రాత్రి నిద్రలోనే కన్నుమూసింది. ఇది తెలియని ఆమె కుమారుడు తన తల్లి ఇంకా నిద్రపోతుందని అనుకున్నాడు. ఎప్పటిలాగే ఆటలాడుకుంటూ రెండు రోజుల పాటు తల్లి మృతదేహంతోనే ఉన్నాడు. ఆకలి వేసినప్పుడు అమ్మ వంట చేయలేదని పక్కింటికి వెళ్లి భోజనం చేసి వచ్చేవాడు. తన తల్లి మృతదేహం పక్కనే నిద్రించేవాడు.


రెండు రోజుల తర్వాత మృతదేహం నుంచి దుర్వాసన రావడం మొదలైంది. దీంతో ఆ బాలుడు పక్కింటికి వెళ్లి అమ్మ నాతో మాట్లాడటం లేదని, ఏదో వాసన వస్తోందని వారికి చెప్పాడు. వారు అన్నమ్మ ఇంటికి వచ్చి చూసేసరికి అసలు విషయం బయటపడింది. ఆమె మృతి చెందినట్లు గుర్తించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. శవపరీక్షల కోసం అన్నమ్మ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అన్నమ్మ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa