ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాల్వాన్ లోయలో క్రికెట్ ఆడి.... చైనాకు సవాల్ విసిరిన భారత్ ఆర్మీ

national |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2023, 09:11 PM

ఎపుడు మన దేశంపై కాలుదువ్వే చైనాకు ఈ సారి మన భారత ఆర్మీ వినూత్నంగా సవాల్ విసిరింది. గాల్వాన్ లోయ.. ఈ పేరు వినగానే భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు గుర్తొస్తాయి. 2020 జూన్ 15, 16 తేదీల్లో జరిగిన కొట్లాటలో 21 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందగా.. చైనా సైన్యానికి సైతం పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. బుల్లెట్ పేల్చొద్దనే నిబంధనను పాటిస్తూనే.. ముళ్ల కర్రలతో చైనా సైన్యం దొంగ దెబ్బతీయాలని ప్రయత్నించగా.. ఇండియన్ ఆర్మీ దీటుగా బదులిచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. భారత్, చైనా సైనికాధికారుల మధ్య ఇప్పటికీ ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇటీవలే ఢిల్లీలో జీ20 సదస్సులో భాగంగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్.. చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్‌తో చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు అసాధారణంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ భేటీ ముగిసిన కొద్ది గంటల్లోనే గాల్వాన్ లోయకు అతి చేరువగా.. భారత సైనికులు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న ఫొటోలను ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది.


తూర్పు లడఖ్‌లో.. గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తిన ప్రాంతానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో.. గడ్డ కట్టించే చలిలో.. 14 వేల అడుగుల ఎత్తులో భారత జవాన్లు క్రికెట్ ఆడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాటియాలా బ్రిగేడ్‌కు చెందిన త్రిశూల్ డివిజన్ అత్యంత ఎత్తయిన, అతి శీతల ప్రాంతంలో ఈ క్రికెట్ పోటీలను నిర్వహించిందని ఆర్మీకి చెందిన 14 కార్ప్స్ వెల్లడించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తామని 14 కార్ప్స్ వెల్లడించింది.


ఈ క్రికెట్ మ్యాచ్‌ను ఎక్కడ నిర్వహించారనే విషయాన్ని ఇండియన్ ఆర్మీ కచ్చితంగా వెల్లడించలేదు. కానీ పెట్రోల్ పాయింట్ 14కు 4 కిలోమీటర్ల దూరంలో ఈ మ్యాచ్ జరిగిందని తెలుస్తోంది. గాల్వాన్ ఘర్షణలు ఈ పాయింట్ దగ్గరే చోటు చేసుకున్నాయి. ఘర్షణల అనంతరం ఇరు దేశాల సైన్యం అక్కడి నుంచి 1.5 కిలోమీటర్లు వెనక్కి వెళ్లాయి. దాన్ని బఫర్ జోన్‌గా మార్చారు. భారత సైన్యం 700 మీటర్లు వెనక్కి వెళ్లగా, తొలి క్యాంప్ 700 మీటర్ల వెనుక ఉంది. రెండో క్యాంప్, మూడో క్యాంప్ దాదాపు అంతే దూరంలో ఉన్నాయి. అక్కడి నుంచి చైనా సైన్యం కదలికలను నిశితంగా గమనిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa