చిత్తూరు జిల్లా నుండి ప్రారంభమైన పీలేరు నియోజకవర్గం జ్యోతినగర్ (పులిచర్ల మండలం) విడిది కేంద్రం నుంచి పాదయాత్ర లో నేడు వైభవంగా ప్రారంభమైన సందర్భంగా తెలుగు యువత నాయకులతో భారీ గజమాలతో సంఘీభావం తెలిపి "యువగళం" పాదయాత్రలో పాల్గొన్న శ్రీ సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ. అనంతరం మాట్లాడుతూ పాదయాత్ర ప్రారంభం నుండి నేటి విశ్రాంతి స్థలం వరకు నారా లోకేష్ తో కలిసి పుట్టపర్తి నియోజకవర్గం నుంచి దాదాపు 50 మంది కార్యకర్తలతో పాదయాత్రలో పాల్గొన్న సామకోటి ఆదినారాయణ 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు రాష్ట్ర యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు అండగా ఉండాలని అన్నారు. రాష్ట్రమును తిరిగి దారిలో పెట్టాలంటే మరలా చంద్రబాబు నాయుడు మాత్రమే ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజానీకం కోరుకుంటున్నారని అన్నారు. ఒక్క చాన్స్, ఒక్క చాన్స్ పేరుతో అధికార్మలోకి వచ్చి అన్ని వర్గాలను జగన్ రెడ్డి బ్రష్టు పట్టించారని అన్నారు. లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా రాష్ట్ర యువత అంతా ముందడుగు వేయాలి అని ఈసందర్భంగా సామకోటి ఆదినారాయణ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ఓబుల్ రెడ్డి, తెలుగు యువత నాయకులు మహేష్ రెడ్డి, తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ సుధాకర్, ఆరో వార్డు ఇంచార్జ్ బేకరినాయుడు, రవి, రాజశేఖర్, భాస్కర్, ఉపేంద్ర, శ్రీనివాసులు, నరసింహులు, సూర్య, వెంకటరాముడు, సుధాకర్ తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa