నెల్లూరు నగరంలోని 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీ తదితర ప్రాంతాలలో నగర శాసనసభ్యులు డాక్టర్ పి. అనీల్ కుమార్ మంగళవారం పర్యటించి డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే గడప గడపకు కార్యక్రమంలో ఏదైతే ప్రజలు స్థానిక సమస్యలను తెలిపారో వాటిని త్వరలో పూర్తి చేస్తామనన్నారు. ఈనెల 13న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థులు పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించవలసినదిగా కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa