ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏబీసీ వలలో రెవిన్యూ అధికారి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2023, 08:11 PM

అనంతపురం జిల్లా,  రొళ్ళ మండలం దొడ్డేరి వీఆర్వో లక్ష్మీదేవి పాసుపుస్తకం కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపిన వివరాలివి. దొడ్డేరి పంచాయతీ పరిధిలోని అప్పేపల్లికి చెందిన రంగమ్మ భర్త 2006లో చనిపోయాడు. భర్త పేరుమీదున్న పట్టాదారు పాసుపుస్తకాన్ని తన పేరు మీదికి మార్చాలని రంగమ్మ.. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతోంది. ఈ నేపథ్యంలో వీఆర్వో లక్ష్మీదేవిని సంప్రదించింది. అందుకు లక్ష్మీదేవి రూ.12వేలు లంచం డిమాండ్‌ చేసింది. తొలుత రూ.6 వేలు, పని పూర్తయ్యాక మిగతా మొత్తం ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. లంచం ఇచ్చేందుకు ఇష్టం లేకపోవడంతో రంగమ్మ కుమారుడు గోవిందరెడ్డి.. ఏబీసీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రొళ్లలో రూ.6 వేలు గోవిందరెడ్డి నుంచి వీఆర్వో లక్ష్మీదేవి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి, పట్టుకున్నారు. దాడుల్లో ఏసీబీ ఇనస్పెక్టర్లు ప్రభాకర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, హేమంతరెడ్డి, శాంతిలాల్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa